pawan kalyan

కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో కారుణ్య నియామకాల ప్రక్రియకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కీలక ముందడుగు పడింది. పంచాయతీరాజ్‌ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు చేరింది. గతంలో ఈ నియామకాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. పంచాయతీరాజ్‌ అధికారులు కారుణ్య నియామకాల ఫైల్‌ను ఆర్థికశాఖకు పంపగా, ఆ తర్వాత ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే 1,488 మంది పంచాయతీరాజ్‌ ఉద్యోగుల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. కరోనా మహమ్మారిలో రాష్ట్రవ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు.

వీరిలో.. 1,944 మంది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, 330 మంది కలెక్టర్ పరిధిలో ఉన్నవారు ఉన్నారు. 83 మంది యూనివర్సిటీ ఉద్యోగులు, 560 మంది కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులు, ఈ ఉద్యోగులలో 2,744 మంది కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకోగా, 1,149 దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. బాధిత కుటుంబాలు పవన్ కళ్యాణ్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌శాఖ ఫైల్ సిద్ధం చేసి ఆర్థికశాఖకు పంపింది, అక్కడి నుంచి ముఖ్యమంత్రి వద్దకు చేరింది. సీఎం ఆమోదముద్రతో కారుణ్య నియామకాల ప్రక్రియ ముగియనుంది. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరట కలిగించనుంది.

Related Posts
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని ప్రధానితో చెప్పించండి: షర్మిల
Sharmila comments on Prime Minister Modi visit to AP

అమరావతి: అమరావతి : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలని Read more

చంద్రబాబు విందుకు అమిత్ షా
babu amithsha

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ఏపీకి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళి, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు Read more

నేడు అన్నమయ్య జిల్లాకు చంద్రబాబు..!
CM Chandrababu visit to Annamayya district today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అన్నమయ్య జిల్లాకు రానున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబేపల్లిలో జరిగే ఎన్టీఆర్ Read more

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
vaa

అమరావతి : ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో, టీడీపీ అధినేత మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *