సత్తుపల్లి విద్యాలయంలో ఘనంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమం

ఖమ్మం , సత్తుపల్లి జులై 19 : సత్తుపల్లి పట్టణంలోని స్థానిక సత్తుపల్లి విద్యాలయం శ్రీ చైతన్య గ్రూప్ లో పాఠశాలలో శుక్రవారం ఘనంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ మున్సిపల్ కమిషనర్ రవిబాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్యం నివారణకు ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి మొక్కలు ఎంత దోహదపడతాయని, ప్రతి ఒక్కరు కూడా మొక్కలను శ్రద్ధగా పెంచాలని అలాగే ప్రతి శుక్రవారం కూడా బ్రైడు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పర్యవేక్షకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పాఠశాల డీజిఎం చేతన్ గారికి డైరెక్టర్ శ్రీవిద్య మేడం గారికి చైర్మన్ శ్రీధర్ గారికి పాఠశాల సిబ్బంది విద్యార్థులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.