గీత కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

గీత కార్మికులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలిపింది. గౌడన్నల రక్షణ కోసం ‘కాటమయ్య రక్ష’ అనే సేఫ్టీ కిట్లను ముందుకు తెచ్చింది. ఈ సేఫ్టీ కిట్ల పంపిణీ స్కీమ్‌ను ఆదివారం ప్రారంభించనుంది. కల్లు గీసే సమయంలో చెట్టు ఎక్కిన తర్వాత ప్రమాదవశాత్తు చాలా మంది గీత కార్మికులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. చెట్టు నుంచి తాళ్లకు వేలాడబడ్డ సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇలాంటి ప్రమాదాలు జరిగినా గౌడన్నల ప్రాణాలకు ముప్పు ఏర్పడకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేసింది. వారి రక్షణ కోసం ‘కాటమయ్య రక్ష’ అనే సేఫ్టీ కిట్లను అందిస్తుంది. ఐఐటీ హైదరాబాద్తో కలిసి ఆధునిక టెక్నాలజీతో ఈ సేఫ్టీ కిట్లను తయారు చేశారు. కాగా, ఈ సేఫ్టీ కిట్ల డిస్ట్రిబ్యూషన్ను అబ్దుల్లాపూర్మెట్లో రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.