Good news for central government employees.. DA hike of 2 percent approved

Central Govt: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. శుభవార్త డీఏ 2 శాతం పెంపుకు ఆమోదం

Central Govt : ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డీఏ ను రెండు శాతం పెంచింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ లో నిర్ణయం తీసుకున్నది. డీఏ పెంచడం ద్వారా మొత్తం 1.15 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. వీరిలో 50 లక్షల మంది ఉద్యోగులు కాగా, 65 లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 53 శాతం నుంచి 55 శాతానికి పెరుగనుంది.

Advertisements
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

పెన్షనర్లకు కూడా ఇదే స్థాయిలో డీఏ పెంపు

దీనికి ముందు 2024 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు లభించింది. ఇది జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పెంపు తర్వాత డీఏ ప్రాథమిక వేతనంలో 50 శాతం నుండి 53 శాతానికి పెరిగింది. తాజాగా మరోసారి డీఏ పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో అది 53 నుంచి 55 శాతానికి పెరగనుంది. పెన్షనర్లకు కూడా ఇదే స్థాయిలో డీఏ పెంపును అందించనున్నారు. ఉగాది పండుగ సమీపిస్తోన్న వేళ డీఏ పెంచడంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఏడాది అమల్లోకి

ఇప్పుడు పెంచిన డీఏ జనవరి నుంచి అమలులోకి వచ్చినప్పటికీ ఏప్రిల్ శాలరీతో రానుంది. అంటే మే నెలలో ఉద్యోగుల చేతికి అందనుంది. అప్పుడు 3 నెలల ఎరియర్స్‌తో కలిపి ఉద్యోగుల, పింఛన్‌దారులకు ఇవ్వనున్నారు. 8వ వేతన సంఘం ప్రకటించిన తర్వాత డీఏ పెంచడం ఇదే తొలిసారి. ఈ ఏడాది జనవరి 16న 8వ వేతన సంఘం ఏర్పాటు విషయాన్ని వెల్లడించింది కేంద్రం. అయితే ఈ వేతన సంఘం సిఫార్సులు వచ్చే ఏడాది అమల్లోకి వస్తాయి.

Related Posts
ఈనెల 14 నుంచి ‘పల్లె పండుగ’ – పవన్ కళ్యాణ్
Laddu controversy. Pawan Kalyan to Tirumala today

ఈనెల 14 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. గ్రామ సభల్లో ఆమోదించిన పనులను పల్లె పండుగ సందర్భంగా Read more

Trump Tariffs: ముదురుతున్న చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం..అంతా టెన్షన్!
ముదురుతున్న చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం..అంతా టెన్షన్!

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమై.. ప్రచ్ఛన్న యుద్దంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచుతోంది. Read more

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్‌ అలర్ట్‌..ఎందుకంటే..!
shamshabad airport red aler

జనవరి 26న గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈనెల Read more

మణిపూర్‌లో కుకి-జో ప్రాంతాలకు ప్రవేశంపై నిషేధం
మణిపూర్‌లో కుకి-జో ప్రాంతాలకు ప్రవేశంపై నిషేధం

కుకి-జో ఆర్గనైజేషన్ కమిటీ ఆన్ ట్రైబల్ యూనిటీ (COTU) ప్రకటన విడుదల చేసింది.కుకి-జో ప్రాంతాల్లో ప్రజలకు స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి లేదు అని తెలిపింది. ఈ నిర్ణయం Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×