Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!

Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కృష్ణా జిల్లా నాగాయలంకలో ఏర్పాటు చేయబోయే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్‌ను పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారనే వార్తలు జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారాలకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది.ఈ ప్రాజెక్టును ఏపీలోనే కొనసాగిస్తామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.దీంతో కృష్ణా జిల్లాలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం ఏర్పాటు కాబోతుందనే దానిపై స్పష్టత వచ్చింది.

Advertisements

అనువైన ప్రాంతం

ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది.ఇందులో భాగంగానే 2011లో ఏపీకి ఈ ప్రాజెక్టును కేటాయించింది.అప్పట్లోనే ఈ మిస్సైల్ సెంటర్ నిర్మాణానికి కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామం అనువైన ప్రాంతంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉండటం, గ్రామం చుట్టుపక్కల 6-8కిలోమీటర్ల మేర ఎలాంటి జనావాసాలు లేకపోవడంతో మిస్సైల్ టెస్టింగ్‌ ప్రయోగాలకు ఈ గ్రామం అనుకూలంగా ఉంటుందనే భావనకు వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇది కాస్తా ఆలస్యమైంది. ఇక ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 300 ఎకరాలకుపైగా భూమిని డీఆర్‌డీవో కు కేటాయించింది. అయితే పర్యావరణ అనుమతులు , ఇతర అడ్డంకుల కారణంగా కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. దీంతో 2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించడంతో 2021లో ఆ స్థలాన్ని డీఆర్‌డీవో స్వాధీనం చేసుకొంది. ప్రాజెక్టుకు కేటాయించిన ప్రాంతం చుట్టూ ప్రహారి గోడను నిర్మించింది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం జరగలేదు. అయితే ఈ ఏడాది జనవరిలోనే ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో ఈ కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా చివరి నిమిషంలో రద్దైనట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ప్రధాని మోదీయే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అయితే అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపనతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మోదీ ప్రారంభించనున్నట్టు సమాచారం.

 Andhra Pradesh: ఏపీకి శుభవార్త త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం ఎక్కడంటే!

రెండవ ప్రధాన క్షిపణి

ఈ మిస్సైల్‌ టెస్టింగ్ సెంటర్ నిర్మాణం పూర్తయితే, ఇది ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ తర్వాత భారతదేశంలో రెండవ ప్రధాన క్షిపణి పరీక్షా కేంద్రంగా మారుతుంది. ఇది షార్ట్-రేంజ్ లాంగ్-రేంజ్ క్షిపణుల పరీక్షలకు సహాయపడుతుంది, దీనివల్ల భారత రక్షణ రంగంలో స్వావలంబన ,సాంకేతిక పురోగతి సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Related Posts
TTDలో ప్రక్షాళన చేస్తాం – BR నాయుడు
టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు

TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌గా నియమితులైన బొల్లినేని రాజగోపాల్ నాయుడు, తన నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ Read more

Wakf Bill: రాజ్యసభ ముందుకు నేడు వక్ఫ్‌బోర్డు
Wakf Bill: రాజ్యసభ ముందుకు నేడు వక్ఫ్‌బోర్డు

లోక్‌సభ వక్ఫ్‌ సవరణ బిల్లును బుధవారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా 232 ఓట్లు వచ్చాయి. Read more

Google Gemini: ఘిబ్లీ ఇమేజెస్ ఇప్పుడు గూగుల్ జెమినీ తో..ఎలా అంటే?
Google Gemini: ఘిబ్లీ ఇమేజెస్ ఇప్పుడు గూగుల్ జెమినీ తో..ఎలా అంటే?

ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ స్టూడియో ఘిబ్లీ ప్రత్యేక శైలి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్టూడియో ఘిబ్లీ చేసిన 'స్పిరిటెడ్ అవే', 'మై నెయిబర్ Read more

సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్‌కు పన్నూన్ వార్నింగ్..
vaa copy

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాలలకు గత కొన్ని రోజులుగా బూటకపు బాంబు బెదిరింపులు పంపబడుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×