ఏపీ DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్..

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు శుభవార్త కు చెప్పింది.అర్హత కలిగి ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ఉన్నవారికి ఉచిత ట్రైనింగ్ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. కాగా 16,347 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది.