Good news for AP.. A refinery worth Rs. 80 thousand crores in the state

Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రంలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ

Oil Refinery : ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పెట్రోలియం రంగంలో అనేక రాష్ట్రాల్లో పెట్టుబడులు వస్తున్నాయనీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి అన్నారు. అవకాశాలు వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తెలిపారు.

Advertisements
ఏపీకి గుడ్ న్యూస్ రాష్ట్రంలో

ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోంది

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, ఒడిశా ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హర్దీప్‌ సింగ్‌ పురి మాట్లాడుతూ.. ఒడిశా పారాదీప్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ రాబోతోందని ప్రకటించారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్లమని.. ఇప్పుడు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి.. ఎక్కువ నిల్వ చేస్తామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి వివరించారు.

తొమ్మిది మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల ఆయిల్‌ రిఫైనరీ

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) దేశంలోనే అత్యంత ఖరీదైన ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఇటీవల నిర్ణయించింది. నిర్మాణానికి సుమారు రూ.95 వేల కోట్ల వ్యయం అవసరమని అంచనా వేస్తున్నారు. ఏపీలో తొమ్మిది మిలియన్‌ టన్నుల సామర్థ్యం గల ఆయిల్‌ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు బీపీసీఎల్ అధికారులు తెలిపారు. దేశంలోని ఆయిల్‌, పెట్రో కెమికల్‌ రిఫైనరీల్లో ఇదే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ఏర్పాటుచేసే ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ కోసం భూసేకరణ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌), ఫీడ్‌ బ్యాక్‌ అధ్యయనాల కోసం ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల కింద రూ.6,100 కోట్లు ఖర్చు చేయడానికి బీపీసీఎల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

Read Also: డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్…

Related Posts
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై కేసు నమోదు
A case has been registered against former minister Kakani Govardhan Reddy

అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. నెల్లూరు Read more

Sheikh Hasina :షేక్ హసీనాను అప్పగించాలంటూ భారత్‌ను కోరిన బంగ్లాదేశ్…
Sheikh Hasina షేక్ హసీనాను అప్పగించాలంటూ భారత్‌ను కోరిన బంగ్లాదేశ్…

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం వేగంగా కదులుతోంది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతూ ఉంటున్నారు. అయితే Read more

వామ్మో.. నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ విలువ రూ. 49 లక్షలు
nita ambani water bottle co

రిలయన్స్ అధినేత ముకేశ్ భార్య నీతా అంబానీ తాగే వాటర్ బాటిల్ విలువ అక్షరాలా రూ.49 లక్షలు. నీతా అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్యగా, Read more

పేద మహిళలకు ఉచిత  సిజేరియన్ శస్త్రచికిత్సలు: నైజీరియా ప్రభుత్వం
pregnancy

నైజీరియా ప్రభుత్వం పేద మహిళలకు ఉచిత  సిజేరియన్ శస్త్రచికిత్సలు అందించడానికి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే గర్భిణీ మహిళలకు ప్రయోజనం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×