andhra pradesh

ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు తీపి కబురు

ఏపీ ప్రభుత్వం పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధించే దిశగా.. వంద రోజుల ప్రణాళికను తీసుకొచ్చింది. ఈ ప్రణాళికలో భాగంగా రెండో శనివారం, ఆదివారాల్లో పదో తరగతి విద్యార్థులకు టీచర్లు తరగతుల్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందిస్తోంది. దీంతో విద్యార్థులకు ఇళ్ల నుంచి క్యారియర్ తెచ్చుకునే బాధను తప్పించింది. ఈ నెల 2వ తేదీ (ఆదివారం) నుంచి టెన్త్ క్లాస్ విద్యార్థులకు‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ ద్వారా సెలవు రోజుల్లో భోజనంం అందిస్తున్నారు.

10215 7 12 2024 19 43 38 1 DSC 4458

డిసెంబరు 1, 2024 నుంచి వంద రోజుల ప్రణాళికను పదో తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్నారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో టెన్త్ విద్యార్థులకు సాధారణ రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగన్నర గంటల వరకు ప్రత్యేక తరగతులతో పాటుగా వారిని చదివిస్తున్నారు.మరోవైపు ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులతో పాటుగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. జనవరి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనాన్ని అందిస్తున్నారు.

దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు భోజనం తెచ్చుకోలేక ఇబ్బందిపడుతున్నారు.. సాయంత్రం వరకు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉండేది. విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సెలవు రోజుల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి మార్చి నెల 10 తేదీ వరకు సెలవురోజుల్లోనూ మధ్యాహ్న భోజనం స్కూల్లోనే అందిస్తారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది.

Related Posts
తుఫాన్‌ ఎఫెక్ట్‌..29 రైళ్లు రద్దు : రైల్వే శాఖ ప్రకటన..!
Typhoon effect.29 trains cancelled. Railway department announcement

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం: తుఫాను కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు Read more

కేటీఆర్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు
ktr quash petition rejected in supreme court

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం Read more

75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!
Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన ప్రసంగంలో.. "ఈ పార్లమెంటు సెషన్ అత్యంత ప్రత్యేకమైనది. 75 సంవత్సరాల క్షేత్రంలో Read more

రాష్ట్రాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ డిజాస్టర్ – కేటీఆర్
ktr power point presentatio

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం సాంకేతికంగా, అభివృద్ధి పరంగా ముందుకెళ్తున్నప్పటికీ, రాష్ట్ర రాజకీయాలు కొన్ని అంశాల్లో అవస్థలు ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *