రేపు ఇంద్ర’గిరి’ ప్రదక్షిణ

శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 19న విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సోమవారం ఉ.5.55 గం.కు ఘాటోడ్డు ప్రారంభంలోని శ్రీకామథేను ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంభాలు, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్ రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా గిరి ప్రదక్షిణ జరగనుంది.