హైదరాబాద్‌లో గ్యాంగ్‌రేప్ కలకలం

హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు నేరాలు , అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యముగా మహిళలకు , ఒంటరి ఆడవారికి , అభం శుభం తెలియని చిన్నారులకు రక్షణ కరువైంది. ప్రేమ పేరుతో కొంతమంది , కామంతో మరికొంతమంది , డబ్బు కోసం ఇంకొందరు ఇలా రెచ్చిపోతున్నారు. తాజాగా నేరేడుమెట్‌లో గ్యాంగ్ రేప్ తీవ్ర సంచలనం రేపుతోంది. కాచిగూడ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను ట్రాప్ చేసి యువకులు నేరేడుమెట్ తీసుకెళ్లారు.

బాలికకు గంజాయి తాగించి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం విషయాన్ని తల్లికి బాధితురాలు చెప్పింది. కాచిగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. నేరేడుమెట్ పీఎస్‌కు కేసును పోలీసులు బదిలీ చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన కు సంబదించిన వివరాలు తెలియాల్సి ఉంది.