gang rape on pharmacy stude 1

వరంగల్ లో దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం..!

వరంగల్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగర శివారులోని ఓ ప్రైవేట్​ కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని హాస్టల్ లో ఉంటోంది. గత నెల 15న యువతికి పరిచయం ఉన్న యువకుడు మాట్లాడాలని కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే అందులో ఉన్న మరో ఇద్దరు యువకులు ఉన్నారని తాను రానని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లాడు. వరంగల్‌ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఓయో లాడ్జ్ కి తీసుకెళ్లి అక్కడ యువతికి బలవంతంగా మద్యం తాగించి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు భయంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు.

ఇటీవల పరీక్షలు ముగియడంతో ఇంటికెళ్లిన బాధితురాలు ఇంట్లో వారికి ఈ విషయం చెప్పింది. మంగళవారం తల్లితో కలిసి వరంగల్‌ పోలీసు కమిషనర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కమిషనర్ సూచనల మేరకు మంగళవారం ఇంతేజార్‌గంజ్‌ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇంతెజార్ గంజ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు చెప్పిన వివరాలను అనుసరించి ఆమెను నిర్బంధించిన కూరగాయల మార్కెట్ సమీపంలోని లాడ్జిలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అక్కడ ప్రధాన నిందితుడు ఇచ్చిన ఆధార్ కార్డ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

ఆధార్ సాయంతో బాధితురాలి మిత్రుడితో పాటు ఇంకొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిది భూపాలపల్లిగా గుర్తించారు. పరారీలో ఉన్న మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మూడో నిందితుడిని కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Related Posts
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్1

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2025కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పరీక్ష భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, Read more

MLC Mallana: మల్లన్నరాజకీయ పయనం ఎటు?
MLC Mallana: మల్లన్నరాజకీయ పయనం ఎటు

తెలంగాణ అసెంబ్లీలో కీల‌క రాజకీయ పరిణామం తెలంగాణ అసెంబ్లీ వేదిక‌గా రాష్ట్ర రాజ‌కీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బ‌హిష్కృత నేత‌, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న Read more

కెన్యా బంగారు గనిలో చిక్కుకుపోయిన 20 మంది మైనర్లు!
kenya

పశ్చిమ కెన్యాలోని బంగారు గని పాక్షికంగా కూలిపోవడంతో డజను మంది చిక్కుకుపోయారని పోలీసులు మంగళవారం తెలిపారు. పొరుగు దేశాలతో పోలిస్తే కెన్యాలో చిన్న మైనింగ్ రంగం ఉంది. Read more

శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి: ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని శ్రీశైల ముక్కంటి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా Read more