Gali Janardhan Reddy: ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు

Gali Janardhan Reddy: ఓబుళాపురం మైనింగ్ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కేసులో హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ రోజు (మే 6, 2025) తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దనరెడ్డితో పాటు అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి బి. కృపానందం, గాలి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ ఆలీఖాన్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) తదితరులు నిందితులుగా ఉన్నారు.

Advertisements

కేసు నేపథ్యం

ఓఎంసీ అక్రమాలు, అక్రమ మైనింగ్‌పై 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. 2011లో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, గాలి జనార్దనరెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ ఆలీఖాన్‌ను, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

ప్రధాన నిందితులు

ఈ కేసులో బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దనరెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి వ్యక్తిగత సహాయకుడు ఆలీఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ కృపానందం, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై ఐపీసీ సెక్షన్లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తూ మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించడంతో సీబీఐ కోర్టులో గత నెల వాదనలు పూర్తయ్యాయి. 2022లో హైకోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేసింది. మిగిలిన నిందితులకు సంబంధించి సీబీఐ కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించనుంది.

Read also: Talliki Vandhanam: తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం తీసుకున్న తాజా కీలక నిర్ణయం

Related Posts
పుణే రేప్ కేసు – బస్సులో భయంకరమైన నిజాలు బయటకు!
Condom packets, old clothes

పుణే నగరంలో ఇటీవల జరిగిన రేప్ కేసు మరింత సంచలనం రేపుతోంది. నిందితుడు రాందాస్ ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. Read more

2008 డీఎస్సీ అభ్యర్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
2008 dsc candidates telanga

ఏళ్ల తరబడి ఉద్యోగ నియామకాల కోసం ఎదురుచూస్తున్న 2008 డీఎస్సీ అభ్యర్థులకు హైకోర్టు ఉత్తర్వులతో శుభవార్త లభించింది. 1382 పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టి, Read more

KCR : ఫోకస్ అంతా కేసీఆర్ స్పీచ్పైనే..
Telangana: భారీ ఏర్పాట్లతో బిఆర్ఎస్ రజోత్సవం!

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ TG హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరుగుతున్న నేపథ్యంలో, అందరి దృష్టి ఇప్పుడు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రసంగంపై నిలిచింది. Read more

ప్రధానితో సీఎం రేవంత్ భేటీ
pm cm

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం ప్రధానిగా మోదీతో రేవంత్ రెడ్డి కలిసిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×