సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

గద్వేల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాజకీయ తీరు ఎవరికీ అర్ధం కావడం లేదు. ఈయన కాంగ్రెస్ లో ఉన్నారా..? బిఆర్ఎస్ లో ఉన్నారా..? అనేది అర్ధం కాక కార్యకర్తలు అయోమయం అవుతున్నారు. బిఆర్ఎస్ నుండి విజయం సాధించిన ఈయన..రీసెంట్ గా కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు కృష్ణమోహన్ రెడ్డి. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఉండాలని కోరారు.

దీనికి సానుకూలంగా కృష్ణమోహన్ రెడ్డి స్పందించడంతో అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారని.. ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అని వస్తున్న వార్తలను ఖండించారు. కాగా ఇప్పటి వరకు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ పార్టీ మారుతున్నట్లు గాని.. కాంగ్రెస్ లో కొనసాగుతున్నట్లు గాని ప్రకటించలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తరువాత కృష్ణమోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.