G20 సదస్సుకు సిద్దమైన ఢిల్లీ..

ఢిల్లీ వేదికగా G20 సదస్సు 2023 జరగబోతుంది. ఈ నెల 09 , 10 న జరగబోయే ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహా 40కి పైగా దేశాల అధినేతల హాజరవనున్నారు. దేశాధినేతల రాక సందర్భంగా దిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్‌, శాంతిభద్రతల పర్యవేక్షణ విధుల్లో 40 వేల మంది సిబ్బంది ఉన్నారు.

డ్రోన్ దాడులు తిప్పి కొట్టే కౌంటర్ డ్రోన్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. డమ్మీ పేలుడు పదార్థాలపై శునకాలతో డ్రిల్స్ నిర్వహించారు. యమునా నదిలోనూ పడవలతో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దిల్లీ కర్తవ్యపథ్‌, ఇండియా గేట్‌, కీలక ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిఘా కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు.