G. Kishan Reddy త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి

G. Kishan Reddy : త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి

G. Kishan Reddy : త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారని దక్షిణాది భాషల్లో సినిమాలకు హిందీలో విపరీతమైన ఆదరణ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. భాషల మధ్య అంతరాలను తొలగించేందుకు త్రిభాషా విధానం చాలా కాలంగా అమలులో ఉందని ఆయన గుర్తు చేశారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నట్టు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని, ఎవరికైతే ఏ భాష కావాలనుకుంటే, అందులోనే చదివే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు. భాష పేరుతో దేశాన్ని విభజించడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, ఇది అస్సలు సమంజసం కాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై విమర్శలు చేస్తూ, ఆయన తన పాలన గురించి చెప్పి ప్రజల నుంచి ఓట్లు అడగాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజల కోసం ఏమీ చేయకపోవడంతోనే స్టాలిన్ దుష్ప్రచారానికి దిగారని ఆరోపించారు.

Advertisements
G. Kishan Reddy త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి
G. Kishan Reddy త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది పూర్తిగా అపార్థమని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి బేగంపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం అమలవుతున్నట్లు వివరించారు. భారత రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ, 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేసి స్టేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. విమానాశ్రయ స్థాయిలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, మొదటి విడతలో రూ. 26.55 కోట్ల వ్యయంతో పనులు సాగుతున్నాయని తెలిపారు.

రెండో విడత పనుల కోసం మరో రూ. 12 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్లు అపరిశుభ్రంగా ఉండేవని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను శుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. బేగంపేట రైల్వే స్టేషన్‌ను పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల ప్రయోజనాల కోసమేనని మంత్రి స్పష్టం చేశారు.

Related Posts
కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి
కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఏపీతో సమస్య వచ్చేది కాదు: రేవంత్ రెడ్డి తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రధాన ప్రాజెక్టులు పూర్తయ్యి ఉంటే, Read more

దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్
దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ, ఆ దావాలకు చట్టబద్ధత లేదని మాజీ మంత్రి టి. హరీష్ రావు మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం Read more

రూ.80,500 కోట్ల అప్పు చేశారు.. అప్పు తప్పు అన్నోళ్లని దేనితో కొట్టాలి?: కేటీఆర్‌
ktr comments on cm revanth reddy

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎం రేవంత్‌ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 10 నెలల్లో రూ.80,500 కోట్ల Read more

Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతుండగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఖాయమని, కాంగ్రెస్ Read more

×