ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ – పొన్నం

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రూ.1100 కోట్లతో 25వేల స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రతి ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు శానిటేషన్ సిబ్బంది, స్కావెంజర్ల కోసం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న HYD కార్వాన్లోని కుల్సుంపుర MPP, UPP స్కూళ్లను మంత్రి సందర్శించారు.