unnamed file

టీడీపీలోకి వైఎస్‌ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని?

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ మాజీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఇప్పటికే ఆయన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తొలుత ఆయన జనసేనలోకి వెళ్తారని వార్తలు వచ్చినా, చివరకు టీడీపీ గూటికే చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా నాని గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓసారి డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

2024 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని ఓడిపోయారు. ఓటమి తర్వాత నాని జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ ఏలూరు జిల్లా నేతలకు టీడీపీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. టీడీపీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నానికి జిల్లా వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటి నాని రాకపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. కానీ.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం నాని చేరికను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నాని తమను ఇబ్బందులకు గురిచేశారని.. లోకల్ టీడీపీ లీడర్లు చెబుతున్నారు. అయితే వారిని సముదాయించి నాని పార్టీలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆళ్ల నానికి వైఎస్‌ఆర్‌సీపీలోని కీలక నేతలతో మంచి సంబంధాలు ఉండేవి. అందుకే తొలి దశలో ఆయన్ను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో ఎందరో కీలక నేతలు ఉన్నా.. నాని మాటకే జగన్ ప్రాధాన్యత ఇచ్చేవారని అక్కడి ప్రజాప్రతిధులు చెబుతారు. అటు వైఎస్‌ఆర్‌సీపీలో మరో కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కూడా నాని అత్యంత సన్నిహితుడిగా పేరుంది.

Related Posts
తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారు? – ఎమ్మెల్సీ కవిత
kavitha telangana thalli

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం పై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని, Read more

Chandrababu;ఇవాళ ఉండవల్లి వచ్చిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు:
chandrababu 1

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కపిల్ దేవ్‌కు హార్దిక స్వాగతం Read more

తెలంగాణ TSPSC గ్రూప్-III పరీక్షకు 50.7% హాజరు..
group 3 1

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-III పరీక్ష 2024 నవంబర్ 18, ఆదివారం ప్రారంభమైంది. ఈ పరీక్షలో 1,363 జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర Read more

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన ప్రధాని
Charlapalli railway terminal was inaugurated by the Prime Minister

హైదరాబాద్‌: రైల్వేశాఖ తమ నెట్ వర్క్ మరింత విస్తరించేందుకు మరో కొత్త రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ.430కోట్లతో కొత్తగా నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *