Andhra Pradesh:ఫేస్‌బుక్ ద్వారా ఆస్తుల వివరాలను వెల్లడించిన మాజీ ఎంపీ హర్షకుమార్

Andhra Pradesh:ఫేస్‌బుక్ ద్వారా ఆస్తుల వివరాలను వెల్లడించిన మాజీ ఎంపీ

ఏపి రాజకీయాల్లో ఎంతోమంది నేతలు కొనసాగుతున్నారు.కొందరు నేతలు వారి ఆస్తుల వివరాలను ఓపెన్‌గా చెబుతుంటారు. కొందరు మాత్రం ఆ వివరాలను కాస్త రహస్యంగానే ఉంచుతారు. ఈ మాజీ ఎంపీ మాత్రం అలా కాదు సోషల్ మీడియా వేదికగా తన ఆస్తుల చిట్టా మొత్తాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. తనకు ఉన్న ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఖరీదైన కార్లు, బైక్‌తో సహా వివరాలను బయటకు చెప్పేశారు.అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. ఫేస్‌బుక్ వేదికగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.’ఇవి నాకున్న కార్లు, ఒక బుల్లెట్. ఇంకోటి స్కార్పియో ప్రచార రధం, వోల్క్ష్వాగేం జిట్టాకూడా ఉన్నాయి. వోల్వో వర్షంలో మునిగి పోయి చెడి పోయింది. అది అమ్మేసాను.బివైడి ఎందుకు కొన్నానంటే ప్రతి నెల లక్ష రూపాయలు రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం బంక్ కు కడతాను. ఇది ఎలక్ట్రికల్ కార్ హైద్రాబాద్ వెళ్లాలంటే 500 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 km వెళ్ళవచ్చు. పనికిమాలిన ఊహా గానాలు మానేయండి.ప్రతి కారు ఫైనాన్స్ లొనే కొన్నుకుంటాము. ప్రతి కారుకు లెక్క పత్రాలు ఉంటాయి. ఇకపోతే రాజమండ్రిలో 1000 గజాలలో 10 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది . వైజాగ్ లో ఆక్సిజన్ టవర్స్‌లో 35 ఫ్లోర్‌లో 3 కోట్ల విలువ చేసే ప్లాట్ ఉంది. అమలాపురంలో ఒక ఇల్లు కొంటున్నాను ట్రాన్సక్షన్ పూర్తి అవ్వలేదు’ అన్నారు.

Advertisements

ఫార్మ్ హౌస్

ముమ్మిడివరం లో రెండున్నర ఎకరాల మామిడి తోట ఉంది. ఒక అర ఎకరం 4th బ్రిడ్జి హైవే మీద ఉంది. దానిలో ఫుడ్ కోర్ట్ , ఫంక్షన్ హాల్ , స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 3 ఎకరాల ఫార్మ్ హౌస్ ఉంది. అది కాలేజ్ పేరు మీద ఉంటుంది.. ఒక కాలేజీ ఉంది. డిగ్రీ పీజీ, ప్రొఫెషనల్ కోర్సెస్ , ఫాషన్ టెక్నాలజీ ఫార్మసీ కాలేజీ ఉన్నాయి. ఆన్లైన్ ఎక్సమినేషన్ ఉంది. దీనిలో ఒక్క ఇల్లు తప్ప ఇంక ఏది నా పేరు మీద ఉండదు అన్ని కొడుకుల పేర్ల మీదే ఉంటాయి. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నావి అని చెప్పుతున్నాను. ఈడీ, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ , స్టేట్ ఏసీబీఅన్ని మీవే కదా పంపించండి. ఏ, ఏ ఆస్తులు ఎలా కొన్నానో ఏ ఏ కార్లు ఎలా కొన్నానో తెలుస్తుంది’ అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టి మరీ ఆస్తుల వివరాలను ఓపెన్‌గా అందరి ముందు చెప్పారు.

 Andhra Pradesh:ఫేస్‌బుక్ ద్వారా ఆస్తుల వివరాలను వెల్లడించిన మాజీ ఎంపీ హర్షకుమార్

వివరాలను

ఇంతకీ మాజీ ఎంపీ హర్షకుమార్ తన ఆస్తుల వివరాలు ఎందుకు ఓపెన్‌గా చెప్పారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన ఇటీవల తన కుమారుడితో కలిసి ఓ కొత్త కారు ముందు నిలబడి ఫోటో తీసుకున్నారు. కొందరు ఈ ఫోటోను ప్రస్తావిస్తూ ప్రవీణ్ పగడాల కేసుకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.ఆస్తుల వివరాలను వెల్లడించారు.

Read Also: Andhra Pradesh: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు

Related Posts
వాట్సాప్‌లో టీటీడీ, రైల్వే సేవలు: సీఎం చంద్రబాబు
TTD and railway services on WhatsApp.. CM Chandrababu

వినియోగదారులకు సులభంగా అర్థమయ్యే విధంగా సేవలు.. అమరావతి: వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వారం రోజుల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల Read more

కర్నూలులో హైకోర్టు బెంచ్: ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు
కర్నూలులో హైకోర్టు బెంచ్: ఏపీ ప్రభుత్వ ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్‌లోని సంకీర్ణ ప్రభుత్వం 'ప్రజాగలం' కార్యక్రమంలో ఇచ్చిన హామీల ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు గణనీయమైన చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా, రాష్ట్ర మంత్రివర్గం Read more

ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోయిన నావ..గంటా శ్రీనివాసరావు
ఇప్పుడు ఆ పార్టీ మునిగిపోయిన నావ..గంటా శ్రీనివాసరావు

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీ Read more

జనసేనలో చేరడం పై తమ్మినేని సీతారాం క్లారిటీ
tammineni

వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తన పార్టీ మార్పు వార్తలను ఖండించారు. జనసేనలో చేరుతున్నారన్న ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. "నేను వైసీపీలోనే కొనసాగుతాను. జనసేనలో చేరాల్సిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×