Sugavasi Palakondrayudu

Sugavasi Palakondrayudu : మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగానికి విషాదవార్త. మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు (78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పాలకొండ్రాయుడి మృతితో ఆయన కుటుంబసభ్యులు, అనుచరులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

బిజెపి నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నిక

1978లో జనతా పార్టీ తరఫున అన్నమయ్య జిల్లాలోని రాయచోటి (అప్పటి డివిజన్) నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించారు. అనంతరం 1983లో స్వతంత్ర అభ్యర్థిగా తిరిగి గెలుపొందారు. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఆయన రాజకీయ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా ఉండే తత్వం ప్రజల్లో విశేష ఆదరణను చూరగొనేవి.

నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి

1999 మరియు 2004లో తిరిగి రాయచోటి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాలకొండ్రాయుడు నిజాయతీగల నేతగా, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన సేవలను చిరకాలం గుర్తుంచుకోవాలని పలువురు అభిప్రాయపడ్డారు.

Read Also : Anurag Thakur : పాకిస్తాన్ పై బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటు స్పందన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×