కర్ణాటక రాష్ట్రానికి మాజీ డీజీపీగా పని చేసిన ఓం ప్రకాశ్ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని ఆయన నివాసంలో రక్తపు మడుగులో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర కలకలం రేపింది.
భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం
ఓం ప్రకాశ్ను తన భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
2015 నుంచి 2017 వరకు కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాలో
ఓం ప్రకాశ్ 2015 నుంచి 2017 వరకు కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాలో విధులు నిర్వహించారు. ఆయన సేవలు రాష్ట్రంలో గుర్తింపు పొందాయి. ఇలా ఉన్నత పదవిలో పనిచేసిన వ్యక్తి దారుణ హత్యకు గురవడం పోలీసులు, ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.