VIRAL: రైలు పట్టాలపై చేపలు

భారీగా కురిసిన వర్షాలకు ముంబై నగరంలోని రైల్వే స్టేషన్లు జలమయమైన విషయం తెలిసిందే. తాజాగా వర్షాలు తగ్గడంతో వరద నీరు తొలగిపోయింది. అయితే వరద నీటిలో కొట్టుకొచ్చిన చేపలు పదుల సంఖ్యలో పట్టాల మధ్య కనిపించిన వీడియో వైరలవుతోంది. ఇది రైల్వే ట్రాక్ కాదు.. ఫిషింగ్ ట్రాక్ అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధముగా ఈసారి ముంబై మహా నగరంపై వరుణ దేవుడు విరుచుకుపడ్డాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అక్కడ జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజూ ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే వారు ఇళ్లలోనే ఉంటున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ఎక్కడ చూసిన వరద నీరు దర్శనమిస్తోంది. రుతు పవనాలు మరింత బలపడటంతో మరో రెండు రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. ముంబై నగరంతో పాటు థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్, రత్నగిరి ఏరియాల్లో ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ముంబైలోని ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాలపై భారీ ఎత్తున నీరు చేరింది. అయితే, ఆ నీటిపై భారీ చేపలు తేలియాడుతూ కనిపించాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త విపరీతంగా వైరల్ అవుతోంది.

ముంబైలో కురిసిన భారీ వర్షాలకు రైలు పట్టాల మీద తిరుగుతున్న చేపలు pic.twitter.com/6QE5GA6PTz— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024