రైల్వే ట్రాక్ ఫై ఫిష్ ప్లేట్.. నిలిచిన రాకపోకలు

ఈమధ్య ఆకతాయిలు రైలు ప్రమాదాలు సృష్టించేందుకు పదేపదే ప్రయత్నిస్తున్నారు. రైల్వే ట్రాక్ లపై ఇనుప రాడ్స్ పెట్టడం , బండరాళ్లు పెట్టడం పెట్టడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఇప్పటీకే ఇలాంటి ఘటనలు ఈ మధ్య అనేకం జరుగగా..రైల్వే సిబ్బంది ముందుగా వీటిని గుర్తించి ప్రమాదాలు జరగకుండా కాపాడారు. ఇక ఇప్పుడు గుజరాత్లోని సూరత్ సమీపంలో రైల్వే ట్రాకు ఉండే ఫిష్ ప్లేట్(జాయింట్ల కోసం వాడేది) పట్టాలపై పెట్టారు. సిబ్బంది గమనించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అటు మొన్న ఉత్తరాఖండ్లోని రుద్రపూర్ వద్ద పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం అడ్డుగా వేశారు. లోకో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదమే తప్పింది.