అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం..

అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం దిగువగొట్టివీడులో కాల్పుల కలకలం సృష్టించింది. పుల్లగూర శ్రీరాములు అనే వ్యక్తిపై గురిజాల పాపారావు అనే వ్యక్తి నాటు తుఫాకితో కాల్పులు జరిపినట్లు ఆరోపించారు.

కాల్పుల్లో గాయపడ్డ పుల్లగూర శ్రీరాములు.. ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. భూ వివాదమే ఇందుకు కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. దీంతో గ్రామస్తులు పిస్తోల్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు పాపారావు వాడినది రియల్ పిస్టల్ కాదని పోలీసు నిపుణులు తేల్చారు. ఎయిర్ గన్ తో శ్రీరాములు తలపై పాపారావు కొట్టినట్లు తెలిపారు. ఎయిర్ గన్ తో ప్రత్యర్దులను భయబ్రాంతులకు గురి చేసినట్లు చెప్పుకొచ్చారు.