TTD పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం

తిరుపతిలోని TTD పరిపాలన భవనంలో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలు డాక్యుమెంట్లు కాలి బూడిదైనట్లు తెలుస్తోంది. బోర్డు పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన పత్రాలు వాటిలో ఉన్నట్లు సమాచారం. ఇది కేవలం ప్రమాదమేనా లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదంపై టీటీడీ పరిపాలన భవనం ఉద్యోగి నాగార్జున పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే మంటలను టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు. టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోని ఇంజినీరింగ్ విభాగంలో ఈ మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సెక్షన్ ను చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్ పరిశీలించారు.