మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ వల్ల కొత్త బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆర్జీలు, భూములకు సంబంధించిన ఫైల్స్‌, ఎలక్షన్‌ ఫైల్స్‌, పలు రికార్డులు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.