Fire accident in Hussainsagar

హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్‌: గత రాత్రి హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదంలో రెండు బోట్లు దగ్ధమవగా ఒక్క బోటులో స్నేహితులు తో వెళ్లిన అజయ్ (21) అనే యువకుడు కనిపించడం లేదు. అజయ్‌తోపాటు వెళ్లిన స్నేహితులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. అజయ్ ఏ ఆస్పత్రిలోనూ లేడని పోలీసులు చెబుతుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజయ్ స్నేహితులు నుంచి లేక్ పోలీస్ స్టేషన్ పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

image

కాగా, భరతమాత పౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ‘భరతమాత మహా హారతి’ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు బోట్లలో బాణసంచా పేల్చడానికి కొందరు యువకులు రెండు బోట్లలో హుస్సేన్‌సాగర్‌ మధ్యలోకి వెళ్లారు. బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వులు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. నిప్పురవ్వలు తిరిగి అవే బోట్లలో ఉంచిన బాణసంచాపై పడటంతో బోట్లకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు బోట్లు దగ్ధం కాగా.. అందులో ఉన్నవారు స్వల్పగాయాలతో సురక్షితంగా బయట పడ్డారు. వారిలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

image

నగరానికి చెందిన అజయ్ తన కొలిగ్స్‌తో కలిసి హుస్సేన్‌సాగర్‌కు వచ్చాడు. అయితే బోట్స్‌లో అజయ్ ఉన్నట్లు ఫ్రండ్స్ చెబుతున్నారు. బోట్‌లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అందులో ఉన్నవారు అందరూ నీటిలోకి దూకారు. అదే సమయంలో అజయ్‌తోపాటు అతని స్నేహితులు ఉన్నారు. వారు సురక్షితంగా బయటపడ్డారు. అయితే అజయ్ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజయ్ ఎక్కడా ఏ ఆస్పత్రిలో జాయిన్ కాలేదని.. ఇదే విషయాన్ని పోలీసులు కూడా స్పష్టం చేశారు. అజయ్ అనే పేరుతో ఎవరూ ఆస్పత్రిలో జాయిన్ కాలేదని, క్షతగాత్రుల వివరాల్లో అజయ్ పేరు లేదని పోలీసులు తెలిపారు. దీంతో అజయ్ ఏమయ్యాడనే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Related Posts
13 నిమిషాల్లోనే డోనర్ గుండె త‌ర‌లింపు..
Donor's heart moved within 13 minutes

హైదరాబాద్‌: నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన Read more

కత్తితో హల్ చల్..
employee attack

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు లీవ్స్ ఉండటం సహజమే.ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు లీవ్స్ పెట్టడం చూస్తుంటాం. ఒకవేళ Read more

విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు శుభవార్త
Telangana Inter Board good news for students

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి. ప‌రీక్ష రాస్తున్న విద్యార్థులు ఇప్ప‌టికే సీరియ‌స్‌గా ప్రిపేర్ అవుతున్నారు. కొంద‌రు ట్యూష‌న్లు పెట్టించుకుని Read more

నేడు పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం
పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *