కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది. బుధువారం ఉదయం ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు.

ఇప్ప‌టికే ఈ భ‌వ‌నంలో వంద‌లాది మందికి చిక్కుకుపోయారు.. వారిలో 54 మందిని ర‌క్షించి చికిత్స కోసం హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

అగ్రిప్రమాదం ప‌ట్లు భార‌త విదేశాంగం మంత్రి జై శంక‌ర్ దిగ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద వివరాల‌ను అక్క‌డి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌మాద‌స్థలానికి వెళ్ల‌వ‌ల‌సిందిగా కువైట్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌య అధికారులను జై శంక‌ర్ ఆదేశించారు.

#Kuwait Mangaf Fire: Initial causes indicate poor storage on the ground floor and the presence of many gas cylinders, Firefighters, MOI and MOH to assess the deaths and injuries.. #الكويت pic.twitter.com/LNCpkhZdae— Ayman Mat News (@AymanMatNews) June 12, 2024