Supreme Court: కోర్టు ధిక్కారం కేసులో డిప్యూటీ కలెక్టర్‌కు జరిమానా

Supreme Court: కోర్టు ధిక్కారం కేసులో డిప్యూటీ కలెక్టర్‌కు జరిమానా

ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న తాతా మోహన్‌రావును తహసీల్దార్‌ స్థాయికి డిమోట్‌ చేయాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. 2013లో తహసీల్దార్‌గా పనిచేస్తున్నప్పుడు ఆయన హైకోర్టు( Hi court) హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గుంటూరు జిల్లా అడవితక్కెళ్లపాడులో గుడిసెలను తొలగించడాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణనలోకి తీసుకొని ఈ వేటు వేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన బెంచ్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు శిక్ష: జైలు శిక్షతోపాటు జరిమానా
కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు హైకోర్టు మోహన్‌రావుకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పిచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు మోహన్‌ రావు కోర్టుకు వెల్లడించారు. ఏపీ విభజన ఉద్యమం జరుగుతున్న ఆ రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉండేవని, అందువల్ల కొందరు రాత్రికి రాత్రి వేసుకున్న గుడిసెలను మాత్రమే తొలగించామని చెప్పారు. అయితే హైకోర్టు తీర్పు ప్రకారం తాను 48 గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోతుందని, దానివల్ల తన కుటుంబం రోడ్డున పడుతుందని, పిల్లల చదువులు దెబ్బతింటాయని మోహన్‌రావు కోర్టులో వాపోయారు.

Advertisements
Supreme Court: కోర్టు ధిక్కారం కేసులో డిప్యూటీ కలెక్టర్‌కు జరిమానా
Supreme Court: కోర్టు ధిక్కారం కేసులో డిప్యూటీ కలెక్టర్‌కు జరిమానా

సుప్రీం కోర్టు తీర్పు: శిక్ష సవరించి పదవీ కోత
దీంతో సుప్రీం కోర్టు, హైకోర్టు మోహన్‌రావుకు విధించిన శిక్షను సవరించి.. డిప్యూటీ కలెక్టర్‌ పదవి నుంచి తహసీల్దార్‌ పోస్టుకు డిమోట్‌ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆయన పేదల ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వారాల్లోపు రూ.లక్ష జరిమానా చెల్లించి, రసీదు కూడా కోర్టుకు సమర్పించాలి. తదుపరి పదోన్నతుల కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ నుంచి తహసీల్దార్‌గా పనిచేసేందుకు అంగీకరిస్తూ అండర్‌టేకింగ్‌ లెటర్‌ ఇవ్వాలని గత వాయిదాల్లోనే సూచించినా మోహన్‌రావు అంగీకరించకపోవడంతో జస్టిస్‌ గవాయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిటిషనర్‌ తొలిరోజే ఇందుకు అంగీకరిస్తే మేం 2, 3 ఇంక్రిమెంట్ల కోతతో ఆపేసేవాళ్లం. కానీ నాలుగు వాయిదాల వరకు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా అంగీకరించకపోతే ఏ ప్రభుత్వం సాహసించలేని ఉత్తర్వులిచ్చేవాళ్లం.” న్యాయమూర్తి అన్నారు.

Read Also: Krishnadevarayalu: తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి:లావు శ్రీకృష్ణదేవరాయలు

Related Posts
కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ షాక్
ycp kamalapuram

వైసీపీ అధినేత జగన్ కు వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలంతా రాజీనామా చేస్తూ టీడీపీ , జనసేన Read more

పూణె నిందితుడి కేసు : పోలీసులకు అజిత్ పవార్ ఆదేశం
పూణె నిందితుడి కేసు : పోలీసులకు అజిత్ పవార్ ఆదేశం

మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన పూణె బస్సు అత్యాచార కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను Read more

బిల్డింగ్ పై నుండి దూకి ప్రేమజంట ఆత్మహత్య
lovers suicide

విశాఖపట్నం జిల్లా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కిరెడ్డిపాలెంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. అమలాపురం ప్రాంతానికి చెందిన పిల్లి దుర్గారావు, Read more

India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా?
India Pakistan War: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ కొనసాగేనా

ఆపరేషన్ సిందూర్ ప్రభావం: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు – ఐపీఎల్ 2025 సీజన్‌పై సందిగ్ధత భారత సైన్యం ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలపై Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×