మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు నోరు తీపి చేసిన రాష్ట్రపతి

finance-minister-nirmala-sitharaman-meets-president-droupadi-murmu-at-rashtrapati-bhavan

న్యూ ఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ఈరోజు పార్లమెంట్‌లో 2024 బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టనున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు లోక్‌ సభలో బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిసి బడ్జెట్‌ సమర్పణకు అనుమతి తీసుకున్నారు.

ముందుగా ఇవాళ ఉదయం నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ‌కు వెళ్లిన నిర్మలమ్మ అక్కడి నుంచి బ‌హీఖాతా తీసుకువ‌చ్చారు. ఎరుపు రంగులో ఉన్న బ‌హీఖాతాలో బ‌డ్జెట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. బ‌హీఖాతా పౌచ్‌లో ట్యాబ్లెట్ ఉన్నట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ డాక్యుమెంట్లతో మంత్రి సీతారామ‌న్‌ తన టీంతో కలిసి కాసేప‌టి క్రితం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముకు బ‌డ్జెట్ కాపీల‌ను అంద‌జేశారు. ఈ సందర్భంగా నిర్మలమ్మకు రాష్ట్రపతి నోరు తీపి చేశారు. స్వీటు తినిపించి గుడ్‌లక్‌ చెప్పారు.