Crime News:పండుగ వేళ దారుణం పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి

Crime News:పండుగ వేళ దారుణం పిల్లల్ని చంపి ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి

కాకినాడలో హోలీ పండుగ నాడు జరిగిన దారుణం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని భావించిన ఓ తండ్రి వారిని చంపేసి తాను ఉరివేసుకున్నాడు.ఈ ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ (ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్) గా పనిచేస్తున్నాడు.తన కుమారుడు జోషిల్ (7) మరియు కుమారుడు నిఖిల్ (6) ను హత్యచేసి, తాను ఉరి వేసుకున్నాడు.

Advertisements

పిల్లలు సరిగా చదవడం లేదని మనస్తాపం

హోలీ పండుగ నాడు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగింది ఈ దారుణం. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ భార్య తనూజ, ఒకటో తరగతి చదివే కుమారుడు జోషిల్ (7), యూకేజీ చదివే చిన్న కుమారుడు నిఖిల్ (6),తో కలిసి నగరంలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. పిల్లలుసరిగ్గా చదవడం లేదని ఇటీవల వారు చదువుతున్న స్కూల్ మార్పించాడు.

బకెట్లో ముంచి చంపేసిన వైనం

చంద్రకిశోర్ నిన్న భార్య, పిల్లలతో కలిసి ఆఫీసులో నిర్వహించిన హోలీ వేడుకలకు హాజరయ్యాడు. ఆ తర్వాత పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు వెళ్తున్నానని, అక్కడే ఉండాలని, పది నిమిషాల్లో వస్తానని భార్యను నమ్మించి పిల్లలను తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో అనుమానం వచ్చి తనూజ ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో తోటి ఉద్యోగులను తీసుకుని ఇంటికి వెళ్లింది. తలుపు వేసి ఉండటంతో కిటికీ లోంచి చూడగా భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లగా పిల్లలిద్దరూ కాళ్లు, చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగిపోయి కనిపించారు. ఆ దృశ్యాలు చూసిన తనూజ కుప్పకూలిపోయింది. 

dead 2

పోటీ ప్రపంచం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే పిల్లల్ని చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దర్యాప్తు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తమ సోదరుడికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఆస్తులు ఉన్నాయని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి బ్రదర్ వాపోతున్నారు. ఎంత పిల్లలు చదువులో వెనుకబడిపోతే మాత్రం ఇలా చంపేసి చచ్చిపోవటం ఏమిటి? అంటూ ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ కు గురవుతున్నారు.

Related Posts
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీం కోర్టులో విచారణ.. ధర్మాసనం కీలక తీర్పు
supreme court appoints special sit for tirumala laddu probe

supreme-court-appoints-special-sit-for-tirumala-laddu-probe న్యూఢిల్లీ: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఈ మేరకు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో Read more

ప్రయివేట్ భూముల తొలగింపు
ప్రయివేట్ భూముల తొలగింపు

ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం పేదలకు, నిజమైన భూ యజమానులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రయివేట్ భూముల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & Read more

వల్లభనేని వంశీ కేసులో టీడీపీకి షాక్!
వల్లభనేని వంశీ కేసులో టీడీపీకి షాక్!

ఏపీలో గత ఎన్నికలకు ముందు జరిగిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా 88 మందికి భారీ Read more

పోసానిపై న్యాయపోరాటం చేస్తామన్న అంబటి
పోసానిపై న్యాయపోరాటం చేస్తామన్న అంబటి

పోసానిపై న్యాయపోరాటం చేస్తామన్న అంబటి సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోని పోలీసులు పీటీ వారెంట్ ఆధారంగా గుంటూరు జైలు నుంచి తరలించడం పట్ల వైసీపీ నేత Read more

×