పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకుల మృతి

చాలామందికి కుక్కలంటే ఇష్టం. ఆ ఇష్టంతో ఇంట్లోకి వేలు పెట్టి కుక్కలను తెరుచుకొని పెంచుకుంటారు. కానీ ఒక్కోసారి వాటి నోటికే బలైపోతారు. తాజాగా భీమిలి లో అదే జరిగింది. భీమిలి కి చెందిన నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) లను వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది.

భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచిన వారి పెట్ డాగ్ రెండు రోజుల్లో చనిపోవడంతో వారు అలెర్ట్ అయ్యారు.రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు. అయితే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే తండ్రి కొడుకు మరణించారు. వీరి మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి.