rythu bharosa

జనవరి 26 నుంచి రైతు భరోసా

రైతు భరోసా పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.
ఈ పథకంలో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.12 వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించింది.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధం లేదని ఆరోపిస్తున్నారు రైతు సంఘాల నేతలు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలలో ఒకటిగా ఈ పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, రైతు డిక్లరేషన్‌లోనూ చెప్పింది.
అయితే, దఫదఫాలుగా సాయాన్ని పెంచుమతాని చెబుతోంది ప్రభుత్వం. జనవరి 26 నుంచి అమలు చేస్తామని చెప్పిన రైతు భరోసా పథకం కింద రూ. 12 వేలు ఇస్తామని తాజాగా ప్రకటించింది ప్రభుత్వం.

హామీకీ, ఆచరణకు పొంతన లేకపోవడంపై అభ్యంతరం చెబుతోంది తెలంగాణ రైతు సంఘం. ”అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగం ఓట్లు ఆకర్షించేందుకు మేనిఫెస్టోలో రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పడింది.కమిటీ సిఫార్సుల ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం చెబుతోంది.సాగు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన కీలక సిఫార్సు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రామాల వారీగా సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేసి, దాని ఆధారంగా 26వ తేదీ నుంచి రైతు భరోసా సాయం అందించనున్నారు.

Related Posts
మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు
Harish Rao stakes in Anand

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి హరీష్ రావుపై మంగళవారం కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.తన ఫోన్ Read more

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ సూటి ప్రశ్న

కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ తీవ్రంగా స్పందించారు. "బీజేపీ భావజాలం ఉన్నవారికే అవార్డులు ఇస్తారా?" అంటూ బండి Read more

నేడు మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటన
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి నేడు బిజీబిజీగా గడపనున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో గల మంచిరేవులలో ముఖ్యమంత్రి Read more

ప్రతిపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలి: మహేష్ కుమార్ గౌడ్
mahesh kumar

ప్రతిపక్ష నేతలు ప్రచారం చేస్తున్న అబద్ధాలను తిప్పికొట్టాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని Read more