భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో పాకిస్థాన్ మరో దిన చర్యకు పాల్పడింది. తాజా సమాచారం మేరకు రాజస్థాన్లోని జైపూర్ ఎయిర్పోర్టులో శుక్రవారం రాత్రి భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ ‘టైమ్స్ నౌ’ నివేదించింది. పేలుడు శబ్దాలు రావడంపై ప్రయాణికులు, సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.
అసలు అక్కడ ఏం జరుగుతోందన్న విషయమై స్పష్టత లేదు
బ్లాక్ అవుట్ కారణంగా అసలు అక్కడ ఏం జరుగుతోందన్న విషయమై స్పష్టత లేదు. ప్రస్తుతం ఏ అధికారిక ప్రకటన వెలువడలేదని సమాచారం. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులు జరుపుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్లు, పేలుడు పదార్థాలు తరలింపుతో జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతోంది.
జైపూర్ ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు
భద్రతా యంత్రాంగం అప్రమత్తమై జైపూర్ ఎయిర్పోర్టులో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాటు, బాంబ్ స్క్వాడ్ దళాలు రంగంలోకి దిగాయి. కేంద్ర హోంశాఖ కూడా ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సమగ్ర నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని సూచనలు జారీ అయ్యాయి.
Read Also : Telangana Government : తెలంగాణ పౌరులకు ఢిల్లీలో హెల్ప్ లైన్