బాణాసంచా గోడౌన్‌లో పేలుడు.. న‌లుగురు మృతి

Explosion in fireworks godown.. 4 dead

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్ట‌రీ గోడౌన్‌లో పేలుడు సంభ‌వించింది. ఫిరోజాబాద్‌లోని నౌషేరాలో ఆ బ్లాస్ట్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఆరు మంది గాయ‌ప‌డ్డారు. పేలుడు ధాటికి ఇళ్లు కూలిపోయింది. ఆ ఇంటి శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. శిఖోహాబాద్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ ఇంట్లో బాణాసంచాను నిలువ చేశారు. అక్క‌డ ఈ భారీ పేలుడు జ‌రిగింది. పేలుడు ధాటికి స‌మీపంలోని ఓ ఇంటి రూఫ్ కూలిపోయింది. శిథిలాల నుంచి ప‌ది మంది బాధితుల‌ను త‌ర‌లించారు. ఆరుగురికి ఆస్ప‌త్రిలో చికిత్స జ‌రుపుతున్నారు. ఇంకా రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంద‌ని ఆగ్రా రేంజ్ ఐజీ దీప‌క్ కుమార్ తెలిపారు.