మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో ఈటెల భేటీ

మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్…బుధువారం కేంద్రం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో బాగంగా ఢిల్లీలో ఉన్న ఈటెల..రాజ్‌నాథ్ సింగ్‌న్ కలిశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ భూములు, ఉద్యోగుల విషయంపై కేంద్ర మంత్రితో ఈటల చర్చించారు.

అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులను విలీనం చేస్తున్న నేపథ్యంలో.. పలు కీలక అంశాలపై స్పష్టత కోరినట్లు ఈటల మీడియాకు తెలిపారు.