విజయసాయిరెడ్డితో సంబంధం లేదు – శాంతి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణమని దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాపోయారు. సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని స్పష్టం చేసారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ వల్ల తన భార్య గర్భం దాల్చిందంటూ దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి పై భర్త మదన్ మోహన్ కీలక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో రెండు రోజులుగా విజయసాయి రెడ్డి పేరు మారుమోగిపోతుంది. 80 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న విజయసాయి రెడ్డి అంటూ అధికార పార్టీ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో దేవదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి మీడియా ముందుకు వచ్చి తనకు పుట్టబోయే బిడ్డకు విజయసాయి రెడ్డి కి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

మదన్ మోహన్‌తో తనకు 2013లో పెళ్లి జరిగిందని, ఆ యేడాదిలోనే గర్భం దాల్చి 2015 ఏప్రిల్ లో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు చెప్పారు. 2010-15 మధ్య తాను ‘లా’ చదివుతున్నప్పుడు భర్త మదన్ చాలా హింసించాడని, ఈ క్రమంలోనే 2016లో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. 2021 వరకూ విశాఖలోనే ఉన్నానని, మదన్‌తో విడాకుల తర్వాత సుభాష్‌ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయినా మదన్ తనన్ను హింసించారని, ఇప్పుడు రూ. 30 కోట్లు ఇవ్వాలని టార్చర్ చేస్తున్నట్లు తెలిపారు.

“నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. అదే వేరే కులానికి చెందిన దాన్నయితే ఇలా అనగలరా? ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు ధరించకూడదా? నేను కష్టపడి న్యాయవాద విద్యను చదివాను, అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేశాను. ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం నాకు లేదు. విజయసాయి గౌరవనీయ వ్యక్తి. నేను విజయసాయిరెడ్డి సార్ ను మొదటిసారి విశాఖలోనే చూశాను. ఆయనకు నాకు పుట్టబోయే బిడ్డకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.