బిలియనీర్,పద్మవిభూషణ్ గ్రహీత,ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ (88)ఈ విషయాన్నీ ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రకటించింది.

‘ఆగాఖాన్ కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలియజేస్తున్నాం.ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన బేధాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు మా భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం’.అని ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఓ ప్రకటనలో పేర్కొంది.ఆయన మరణవార్త కింగ్ చార్లెస్ 3కి తీవ్ర మనస్థాపం కలిగించినట్లు తెలుస్తోంది.ఆయనకు కింగ్ చార్లెస్ 3 ,ఆయన తల్లి దివంగత క్వీన్ ఎలిజిబెత్ 2 కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
ఆగాఖాన్ స్విట్జర్లాండ్లో జన్మించారు.20ఏళ్ళు వయసు 1957 లోనే ఇస్మాయిలీ ముస్లింల 49 వ వంశపారంపర్య ఇమాముగా నియమితులయ్యారు.వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతో పటు ఆయన అనేక ఇతర వ్యాపారాల్లోనూ రాణించారు. యూకే,ప్రాన్స్ ఐర్లాండ్ వంటి దేశాల్లో ప్రముకంగా నిర్వహించే రేసు గుర్రాలోను ఆయన పాల్గొనేవారు.
1967లో ఆగాఖాన్ డెవెలెప్మెంట్ నెట్వర్క్ ను స్థాపించారు.ఇది ప్రపంచంలోనే వందలాదిమంది ఆస్పత్రులు,విద్యా,సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేసింది.ఆయన సేవలకు గాను 2015 కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించింది.