వైసీపీకి ప.గో జడ్పీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా

ఏలూరు జిల్లాలో వైసీపీని నేతలు వదలి వెళ్లిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని రాజీనామాతో మొదలయిన వలసల పర్వం ఆగడం లేదు. ఆళ్ల నాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఏలూరు మేయర్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. తాజాగా ఏలూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీతో పాటు ఆమె భర్త వైసీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రసాదరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్ జగన్కు లేఖ పంపారు. జిల్లా అభివృద్ధి కోసం తాము జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు.