Election of TDP candidate as Deputy Mayor of Tirupati

తిరుపతి డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నిక

తిరుపతి: తిరుపతి కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ పదవిని ఎన్డీయేలోని టీడీపీ కైవసం చేసుకుంది. కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నికను మంగళవారం తిరుపతి ఎస్వీ వర్సిటీ సెనెట్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ, కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా ఎన్డీయే అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్‌ మునికృష్ణ విజయం సాధించారు.

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లుండగా 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీటిలో 3 ఖాళీలున్నాయి. డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు 26 మంది కావాల్సి ఉండగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, తన 21 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరై డిప్యూటీ మేయర్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా భాస్కర్‌ రెడ్డిని పోటీ చేయించారు. అయితే టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.

image

డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడవచ్చనే అనుమానంతో వైసీపీ నాయకులు ముందస్తుగా భద్రత కోసం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎన్నికల కేంద్రం వద్ద అదనపు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా తిరుపతిలో144 సెక్షన్‌ అమలు చేస్తూ 30 పోలీసు యాక్టును అమలు చేసినట్లు ఎస్పీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. గొడవలు సృష్టించేవారికి నోటీసులు అందజేశామని వివరించారు.

Related Posts
విజయ్ రాజకీయ అరంగేట్రం పై సూపర్ స్టార్ స్పందన
rajanikanth vijay

తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించడం తమిళనాడులో రాజకీయంగా పెద్ద సంచలనం రేపుతోంది. విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ "తమిళగ వెట్రి కళగం" Read more

విజయసాయి రెడ్డి.. ఇది ధర్మమా? : బండ్ల గణేష్ ట్వీట్
vijayasai ganesh

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడంపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తనదైన శైలిలో స్పందించారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ Read more

ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ సీఎం అతిషి
Delhi CM Atishi exercised the right to vote

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిషి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా బరిలో సీఎం అతిషి ఓటు వేశారు. ఓటు వేసే ముందు Read more

దోచేసిన నల్ల డబ్బుతో సేద్యం చేస్తావా ఏంటి..?: సోమిరెడ్డి
somireddy chandra mohan reddy comments on vijayasai reddy

అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *