భారీ వర్షాల ఎఫెక్ట్ : తెలుగు రాష్ట్రాల్లో 30 రైళ్లు రద్దు..

అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల పైకి రైల్వే ట్రాక్ లపై వరద నీరు చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. ఇలా ఎక్కడాఇక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి.. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.. భద్రతా కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదివారం, సోమవారంలో దాదాపు 30 వరకు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-కాజీపేట మార్గంలో 24 రైళ్లు నిలిపివేసింది.. సింహాద్రి, మచిలీపట్నం, గంగా-కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్‌పూర్ రైళ్లు నిలిపివేశారు..