హైదరాబాద్ పాతబస్తీలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నారు. భూదాన్ భూముల అక్రమాల వ్యవహారంలో ప్రముఖ వ్యాపారి ఫర్హోన్, మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్ల నివాసాలతో పాటు వారి కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. మహేశ్వరంలో వంద ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల బృందం ఉదయం నుంచే పాతబస్తీలో సోదాలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అబ్దుల్లాపూర్మెట్ భూముల వివాదం
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హయాంలో అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమ ఆక్రమణలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సర్వే నంబర్ 17లో ఉన్న ఈ భూమిలో ప్రైవేట్ భూమి పేరు చెప్పి మరికొంత ప్రభుత్వ భూమిని కూడా వెంచర్లో కలిపారని సమాచారం. రైతులు తమ భూముల్లో అక్రమ వెంచర్ వేస్తున్నారని అప్పట్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడంతో ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు.
ఫర్హోన్పై ఆరోపణలు – భారీ షోరూమ్లు, ఆస్తులపై విచారణ
నగరంలో ఫర్హోన్ ప్రముఖ వ్యాపారిగా కొనసాగుతుండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో అతనికి భారీ షోరూమ్లు ఉన్నాయి. భూదాన్ భూముల అక్రమ కొనుగోళ్లు, కబ్జా వ్యవహారాల్లో అతని పాత్రపై ఈడీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆస్తుల వివరాలు, లావాదేవీలపై గట్టి ఆధారాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తుతో పాతబస్తీలో కలకలం రేగింది.
Read Also : Teasor release: అందరూ ఎదురుచూస్తున్న ‘నిలవే’ టీజర్ విడదల