ED notices to former MLA Marri Janardhan Reddy

మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్ శివారులోని రూ. 1000 కోట్లకుపైగా విలువైన భూదాన్ భూములను ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ప్రైవేటు పరం చేసిన కేసులో ఈడీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డితోపాటు మరో ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది. మహేశ్వరం మండలం నాగారంలోని 50 ఎకరాల భూదాన్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

విచారణ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి రావడంతో తాజాగా మర్రి జనార్దన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కేఎస్ఆర్ మైన్స్‌కు చెందని కె.సిద్ధారెడ్డి, అమ్మద డెవలపర్స్‌కు చెందిన సూర్యతేజ తదితరులకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఎల్లుండి (16న) విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అమోయ్ కుమార్ ద్వారా వీరంతా లబ్ధిపొందినట్టు ఈడీ గుర్తించినట్టు తెలిసింది.

భూదాన్ భూములను ప్రైవేటు పట్టా భూములుగా మార్చి వాటికి రిజిస్ట్రేషన్లు జరగడం వెనుక వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. దస్తగిరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడీ కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది.

Related Posts
హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
kavitha hsp

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి Read more

టెక్నాలజీ వాడకంలో ఏపీ నెం 1 – నారా లోకేశ్
lokesh davos

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ వినియోగంలో నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడిన Read more

శోభితా నాకు ముందే తెలుసు: నాగార్జున
శోభితా నాకు ముందే తెలుసు: నాగార్జున

శోభితా నాకు ముందే తెలుసు, చై కంటే ముందే తెలుసునని నాగార్జున వెల్లడించారు నటుడు నాగార్జున తన కోడలు శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె Read more

ఎనిమిదవ తరగతి విద్యార్థి సూసైడ్
ఎనిమిదవ తరగతి విద్యార్థి సూసైడ్

ఉప్పల్ : 8వ తరగతి చదువుతున్న విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే Read more