EC responded to Rahul Gandh

రాహుల్ గాంధీ ఆరోపణల పై స్పందించిన ఈసీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసిన తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. ఈ ఆరోపణలకు సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

Advertisements

ఈ విషయంపై ఈసీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో స్పందిస్తూ..రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. వారి అభిప్రాయాలు, సూచనలు, ప్రశ్నలను గౌరవంతో స్వీకరిస్తాం. ఈ ఆరోపణలపై త్వరలోనే లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తాం. మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు, విధానపరమైన అంశాలతో కమిషన్‌ వివరణ అందిస్తుంది అని పేర్కొంది.

image

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..లోక్‌సభ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారు.గత ఐదేళ్లలో రాష్ట్రంలో 32లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అంతే కాకుండా,మహారాష్ట్రలో లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల సమయంలో 39లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. అసలు వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?” అని ప్రశ్నించారు.

అదనంగా..39 లక్షల ఓటర్ల సంఖ్య హిమాచల్ ప్రదేశ్ మొత్తం ఓటర్ల సంఖ్యకు సమానం.లోక్‌సభ ఎన్నికల్లో మేము పొందిన ఓట్ల శాతం,అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం సమానంగా ఉంది.కానీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు మాత్రం అదనంగా ఓట్లు వచ్చాయి.ఆఓట్ల ద్వారానే వారికి విజయం లభించింది.ఎన్నికలసంఘం మా డిమాండ్‌ను స్వీకరించి,ఓటర్ల జాబితా,వారి ఫొటోలు, చిరునామాలను అందించాలి అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Related Posts
రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు – సీఎం రేవంత్
cm revanth ryathu sabha

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని మ‌హబూబ్ న‌గ‌ర్ రైతు Read more

దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం అంటు రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం అంటు రేవంత్ రెడ్డి

దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం అంటు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ Read more

కెన్యా బంగారు గనిలో చిక్కుకుపోయిన 20 మంది మైనర్లు!
kenya

పశ్చిమ కెన్యాలోని బంగారు గని పాక్షికంగా కూలిపోవడంతో డజను మంది చిక్కుకుపోయారని పోలీసులు మంగళవారం తెలిపారు. పొరుగు దేశాలతో పోలిస్తే కెన్యాలో చిన్న మైనింగ్ రంగం ఉంది. Read more

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ

భారత ఎన్నికల కమిషన్ (ECI) రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించనుంది, ప్రస్తుత ఆప్, బిజెపి మరియు కాంగ్రెస్ మధ్య Read more

×