EC is conducting the Delhi elections amid heavy preparations

భారీ బందోబస్తు నడుమ ఢిల్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుందని ఈసీ పేర్కొంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో 13,776 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు ఢిల్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తొలి పురుష ఓటర్‌గా ఉమేష్ గుప్తా, తొలి మహిళా ఓటర్‌గా ప్రేరణ నిలిచారు. కరోల్ బాగ్ నియోజకవర్గంలో దర్యాన్ గంజ్ పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisements
image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాలకుగానూ మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. హోమ్‌ ఓటింగ్‌ ద్వారా ఇదివరకే 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 19,000 మంది హోమ్ గార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది సహా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలతో ఎన్నికల కమిషన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది.

మరోవైపు డ్రోన్ కెమెరాలతో నిఘాను పెంచింది. పాతికేళ్ల తరువాత ఢిల్లీ పీఠం సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆప్ నేతలు ఎదురుచూస్తున్నారు. వరుసగా మూడుసార్లు ఆప్ అధికారం లోకి వచ్చింది. కానీ తొలిసారి ఎన్నికల తరువాత కేవలం నెలన్నరకే ప్రభుత్వాన్ని రద్దు చేసి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. దాంతో వరుసగా రెండు టర్మ్‌లుగా ఢిల్లీలో ఆప్ పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

Related Posts
TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు, లోకేశ్‌ నివాళి
TDP Foundation Day.. Chandrababu, Lokesh pay tribute to NTR statue

TDP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా జరింది. ఈ వేడుకలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు , మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. ఈ Read more

వర్సిటీల్లో 3,282 పోస్టులు..ఈ ఏడాదే భర్తీ : లోకేశ్
3,282 vacant posts in universities will be filled this year.. Lokesh

అమరావతి: సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా Read more

హైదరాబాద్‌ చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్
AICC Secretary Meenakshi Natarajan reached Hyderabad

మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం హైదరాబాద్‌: ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్‌ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా Read more

PSL 2025: పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం
PSL 2025: పీఎస్‌ఎల్‌ క్రికెటర్లు బస చేసిన హోటల్‌లో అగ్ని ప్రమాదం

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పి ఎస్ఎల్ ) 2025 సీజన్‌ శుక్రవారం,ప్రారంభం అయ్యింది,అయితే, టోర్నీ ప్రారంభానికి ముందు ఇస్లామాబాద్‌లోని హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ పీఎస్‌ఎల్‌ Read more

Advertisements
×