డీఎస్సీ పరీక్షల నిర్వహణ ఫై డిప్యూటీ సీఎం భట్టి ఫుల్ క్లారిటీ

Deputy CM Bhatti

తెలంగాణ సర్కార్ డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుందా..లేక వాయిదా వేస్తుందా అని అంత సందేహ పడుతున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ ఇచ్చారు. డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని, పోస్టులు పెంచి మళ్లీ కొత్త డేట్ తో నిర్వహించాలంటూ గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భట్టి ఈరోజు మీడియా తో మాట్లాడుతూ ..జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి తీరుతాం అని క్లారిటీ ఇచ్చారు.

11 వేల ఉపాధ్యాయ ఖాళీలను త్వరలో భర్తీ చేయబోతున్నాం. త్వరలో మరికొన్ని ఖాళీలతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశాం. గత ప్రభుత్వం గ‌తేడాది సెప్టెంబర్ మాసంలో 5 వేల పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,75,527 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఆ 5 వేల పోస్టుల‌కు, మరో 6000 కలిపి 11 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేషన్ ఇచ్చాం. మొత్తంగా 2.79 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల 5 వేల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించి తీరుతామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.