యూట్యూబర్‌ ప్రణీత్ హనుమంత్‌పై డ్రగ్స్ కేసు

వావి వరసలు మరిచిపోయి తండ్రీ కూతుళ్లపై నీచంగా కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ ఫై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇతడి ఫై మరో కేసు నమోదు చేసారు పోలీసులు.

ప్రణీత్‌ మత్తు పదార్థాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడికావడం తో ఇతడి ఫై డ్రగ్స్ కేసు నమోదు చేసారు. ప్రస్తుతం ప్రణీత్ చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు. అతణ్ని 3 రోజుల కస్టడీకి కోరుతూ సైబర్ సెక్యూరిటీ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో పోక్సో కోర్టు ప్రణీత్ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది.