Pawan Kalyan: ఉపాధి హామీ పనులు చేసే వారిని కూలీలు అనొద్దు : పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఉపాధి హామీ పనులు చేసే వారిని కూలీలు అనొద్దు : పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా, ఉపాధి హామీ (నరేగా) పనులు చేసే వారిని “కూలీలు” అనడం సరైనది కాదని అన్నారు.ఇది మన సంస్కృతికి అనుకూలమైన పదం కాదని అన్నారు. నరేగా (ఉపాధి హామీ) శ్రామికులు, లేదా గ్రామీణ వికాస శ్రామికులు అని పిలవాలని సూచించారు. కూలీ అనేది బ్రిటిషర్స్ నుంచి వచ్చిందని గ్రామాభివృద్ధికి పాటు పడేవారు కూలీలు కాదన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ గ్రామాల అభివృద్ధితోపాటు అవినీతిని అరికట్టడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ కాలంలో గ్రామాల్లో అన్యాక్రాంతమైన భూములపై సమీక్ష జరపాలని ఆదేశించారు.

Advertisements

పర్యటన

తనకు పల్లెలంటే ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ అక్కడ ఉండే అవకాశం రాలేదని చెప్పారు. అయితే, పంచాయతీరాజ్ శాఖపై తాను ప్రత్యేకమైన ఆసక్తి చూపుతున్నానని తెలిపారు. గ్రామాలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అధికారుల కృషితో గ్రామాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, గతంలో అనేక తండాల పర్యటనల సందర్భంగా అభివృద్ధికి దారులు వేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో 75లక్షల మందికి పైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని చెప్పారు. జాతీయ సమైక్యతను పెంపొందించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలుండాలని అధికారులను ఆదేశించారు. 13 వేల 326 పంచాయతీల్లో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు, స్థూపాలు ఏర్పాటు చేయాలన్నారు.

1200 675 22158156 483 22158156 1723117541102

దిగ్భ్రాంతి

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయం ఇవాళ ఉదయం నెల్లూరు జిల్లా కావలికి చేరింది. మధుసూదన్ భౌతికకాయాన్ని చూసిన కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాసేపట్లో పవన్ కావలికి వెళ్లనున్నారు. మధుసూదన్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ అమాయకులపై దాడులు అసహనంగా మారుతున్నాయని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read Also: YSCP Suspension : పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశానన్న దువ్వాడ శ్రీనివాస్

Related Posts
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు
జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిఠాపురం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధికార పార్టీకి Read more

ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌ దాఖలు
Nagababu files nomination as MLC candidate

అమరావతి: జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు Read more

Ambedkar భావాలను విస్మరిస్తోందా మోదీ ప్రభుత్వం
Ambedkar భావాలను విస్మరిస్తోందా మోదీ ప్రభుత్వం

అంబేడ్కర్ ఆశయాలను విస్మరిస్తున్నదా మోదీ సర్కార్? ఖర్గే వ్యాఖ్యల విశ్లేషణ Ambedkar జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశ రాజకీయం Read more

AP Govt : జీవిత ఖైదీలకు సర్కార్ గుడ్ న్యూస్
life prisoners

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జైళ్లలో మంచి ప్రవర్తనతో ఉండే ఖైదీలను పరిశీలించి త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×