Benefits of Amaravati

Amaravati Relaunch : అమరావతి పైలాన్‌ ప్రత్యేకతలు తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టానికి నాంది పలికే రోజు రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా, రాజధాని పునర్నిర్మాణానికి గుర్తుగా ‘A’ ఆకారంలో 21 అడుగుల ఎత్తైన ప్రత్యేక పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ పైలాన్, తాత్కాలికం కాదే శాశ్వతంగా అమరావతిలో నిలిచే విధంగా రూపొందించారు. అమరావతి మొదటి అక్షరమైన ‘A’ ఆధారంగా రూపొందించిన ఈ గుర్తు భవిష్యత్తులో రాజధాని అభివృద్ధికి గుర్తుగా నిలవనుంది.

Advertisements

అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి చెందిన దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అందులో భాగంగా అమరావతిలో హైకోర్టు భవనం, అసెంబ్లీ, సెక్రటేరియట్, మంత్రుల మరియు న్యాయమూర్తుల నివాసాల నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. ఈ 49,040 కోట్ల విలువైన నిర్మాణ పనులు అమరావతి పరిధిలో జరుగనున్నాయి. అంతేకాదు, డీఆర్డీవో, రైల్వే శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా 57,962 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా నాగాయలంకలో రూ.1500 కోట్లతో మిసైల్ టెస్ట్ రేంజ్‌కు శంకుస్థాపన కీలక ఘట్టంగా నిలవనుంది.

భారీ ఏర్పాట్లు – భద్రతతో కూడిన సభ

ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సభకు దాదాపు 5 లక్షల మంది హాజరుకావచ్చునని అంచనా వేస్తున్నారు. భారీగా జన సంద్రం తలెత్తకుండా మూడు వేర్వేరు ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. వర్షం ఎఫెక్ట్‌ తలెత్తకుండా టెంట్లు, గాలెరీలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రత్యేక మార్గాలను సూచించారు. ప్రధాని రాక నేపథ్యంలో ఎస్‌పీజీ భద్రతను భద్రముగా చేపట్టింది. ప్రధాన వేదికపై కేవలం 14 మంది ప్రముఖులకు మాత్రమే ప్రవేశం కల్పించి, సభను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించనున్నారు.

Read Also :Amit Shah : ఉగ్రవాదం నిర్మూలనపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Related Posts
మరో 5 నెలల్లో అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్
Vijayawada West Bypass unde

విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న వెస్ట్ బైపాస్ రహదారి పూర్తి కావొస్తుంది. ప్రస్తుతం 95% పనులు పూర్తవగా, మిగిలిన పనులు త్వరలోనే Read more

Excise CI: ఆఫీస్‌ బాయ్‌పై చెప్పుతో దాడి చేసిన ఎక్సైజ్‌ సీఐ
Excise CI: ఆఫీస్‌ బాయ్‌పై చెప్పుతో దాడి చేసిన ఎక్సైజ్‌ సీఐ

ఎక్సైజ్‌ సీఐ హసీనాభాను దుశ్శాసనం – అవినీతి వెలుగు లోకి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్‌ కార్యాలయంలో నడుస్తున్న అక్రమాలు తాజాగా వెలుగు చూశాయి. సీఐ హసీనాభాను Read more

Harsha Kumar: మాజీ ఎంపీ హర్ష కుమార్ కు నోటీసులు..!
Notices to former MP Harsha Kumar.

Harsha Kumar: మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ Read more

బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు..దుర్మార్గమైన చర్య: హరీశ్‌ రావు
Government is fully responsible for this incident: Harish Rao

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారు. ఈ క్రమంలోనే Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×