Scheme: కలలకు రెక్కలు పథకం గురించి తెలుసా!

Scheme: కలలకు రెక్కలు పథకం గురించి తెలుసా!

ఏపీ ప్రభుత్వం విద్యార్థినుల కోసం కొత్త పథకం తీసుకురాబోతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నత విద్య చదివే విద్యార్థినుల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం పేరు ‘కలలకు రెక్కలు’గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన అంబేడ్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లు పెంచాలని లెక్చరర్ల కొరతను తీర్చాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేస్తామని చెప్పారు.

Advertisements

గ్యారెంటీ

ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి విద్యార్థినులు రుణాలు తీసుకుంటే వాటికి ప్రభుత్వమే గ్యారెంటీగా నిలుస్తుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో సన్మానించాలని ఆయన అన్నారు. విద్యాశాఖలో బదిలీలు ఎప్పుడూ ఎడ్యుకేషన్ ఇయర్ మొదలయ్యే ముందే పూర్తి చేయాలని లోకేష్ సూచించారు.

కాల్ సమస్య

పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించాను. డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతోపాటు టిసిఎస్ ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని, డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎలాంటి కాల్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. పదోతరగతి పరీక్షా ఫలితాలపైనా సమీక్షించాను. ఉత్తమ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి టెక్స్ట్ బుక్స్, విద్యార్థి మిత్ర కిట్స్ సిద్ధం చేయాలి. అంబేద్కర్ విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభానికి విధివిధానాలు రూపొందించాలి. ఫీజు రీఎంబర్స్ మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తాం. ఉన్నత విద్యనభ్యసించే బాలికల కోసం కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించాను’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

Read Also: Andhra Pradesh: ఏపీ యువతకు ప్రభుత్వం శుభవార్త

Related Posts
అమరావతి నిర్మాణానికి రూ.64,721 కోట్ల వ్యయం: మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి రూ.64,721 కోట్ల వ్యయం: మంత్రి నారాయణ

అమరావతి: ఏపీ శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని Read more

Murali Nayak : మురళీ కుటుంబాన్ని ఓదార్చిన సింగర్ మంగ్లీ
Murali Nayak మురళీ కుటుంబాన్ని ఓదార్చిన సింగర్ మంగ్లీ

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలానికి చెందిన కల్లి తాండా గ్రామం ఈ మధ్య ఓ విషాద వార్తతో national headlines లోకి వచ్చింది. Read more

AP : ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా రాయపాటి శైలజ
Rayapati sailaja

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 22 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. ఈ నామినేషన్లలో టీడీపీ–అమరావతి జేఏసీకి 18, Read more

ఆంధ్రప్రదేశ్‌లో– AI భవిష్యత్తుకు నారా లోకేశ్ ముందస్తు ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్ విప్లవం – AI భవిష్యత్తుకు నారా లోకేశ్ ముందస్తు ప్రణాళిక

భారతదేశాన్ని డేటా హబ్‌గా మార్చేందుకు నారా లోకేశ్ మాస్టర్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ డేటా సెంటర్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×