తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న ప్రభుత్వము, ఈసారి ఉగాది పండుగ కానుకగా రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త అందించనుంది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో రేషన్ కార్డు ఉన్నవారికి భారీ ఊరట కలగనుంది.

ఈ పథకం అమలులో భాగంగా
4.59 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం ఇప్పటికే సిద్ధం చేయబడింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 6 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. మొదట సంక్రాంతి పండుగకు ప్రారంభించాలనుకున్న ఈ పథకం కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఉగాది సందర్భంగా దీన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కొత్త రేషన్ కార్డుదారులకు వర్తిస్తుందా?
ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు దారులందరికీ ఈ సన్నబియ్యం అందనుంది. అయితే, కొత్తగా దరఖాస్తు చేసిన వారికి ఈ పథకం వర్తిస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఈ పథకం వర్తిస్తుందా? అనే అంశంపై ఇంకా స్పష్టత అవసరం. మీ-సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ప్రజల స్పందన
ఈ కొత్త ప్రకటనపై ప్రజలలో మిశ్రమ స్పందన ఉంది.
పాత రేషన్ కార్డు దారులు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నా, కొత్తగా దరఖాస్తు చేసిన వారు తమకు కూడా లబ్ధి ఉంటుందా? అనే ప్రశ్నతో ఎదురు చూస్తున్నారు. ఉగాది కానుకగా సన్నబియ్యం పంపిణీ నిర్ణయం తెలంగాణ ప్రజలకు పండుగ శుభవార్తే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిస్సందేహంగా పేద కుటుంబాలకు ఉపశమనాన్ని అందించనుంది. అయితే, కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుందా? అన్నదానిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది.